Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాజమండ్రిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో హత్య, తదుపరి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసు సమీపంలో ఎస్.ఆర్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ముందు భార్యను హత్య చేసి తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను నడింపల్లి నరసింహారాజు, వెంకటమనమ్మగా గుర్తించారు. భర్త నరసింహారాజు నిడదవోలులో టీచర్గా పనిచేస్తున్నారు. భార్య వెంకటమనమ్మ ఉమెన్స్ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలే భార్యా,భర్తల మృతికి కారణంగా త్రీటౌన్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.