Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరంలోని సాహెబ్నగర్ మ్యాన్హోల్ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.15 లక్షల పరిహారం చెక్కులు అందజేసింది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఈ చెక్కులను బాధితులకు అందజేశారు. ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు, గుత్తేదారు నుంచి రూ.5 లక్షల పరిహారంగా ఇచ్చారు. మరో రూ.2 లక్షల చొప్పున మేయర్ నిధి నుంచి అందజేయడం జరుగుతుందన్నారు. సాహెబ్నగర్లో పూడికతీస్తూ కార్మికులు శివ, అంతయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మేయర్, ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. ప్రతి పక్షాలు చిల్లర రాజకీయాలు మానుకుని బాధితులకు అండగా ఉండాలన్నారు.