Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారి గడ్డం విజయభాస్కర్రెడ్డిని పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని ఆయన అల్లుడు జయసృజన్రెడ్డి పేర్కొన్నారు. కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నెల్లూరుకు చెందిన విజయభాస్కర్రెడ్డి(63)ని హతమార్చి ఏపీలోని సున్నిపెంటలో మృతదేహాన్ని దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై శనివారం జయసృజన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. గురూజీని విమర్శిస్తే చంపుతామని మల్లేశ్, సుధాకర్ అనే వ్యక్తులు గత నెల మొదట్లో తన మామను హెచ్చరించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పారు. కాగా మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్ఎంపీ వైద్యుడు శ్రవణ్ను అరెస్టు చేసినట్లు కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.