Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుపతి: యూపీఎస్సీ ఆర్మ్డ్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్ పరీక్షలు తిరుపతిలో ఆదివారం జరగనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు దశలుగా ఈ పరీక్షలు ఉంటాయి. నాలుగు కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,996 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీవో కనకనరసారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షల ఏర్పాట్లపై శనివారం ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్య, విద్యుత్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.