Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గత 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్వాన్ జిల్లాల్లో శనివారం పిడుగుల వర్షం పడింది. మహిళ సహా నలుగురు మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు. అదే సమయంలో బీహార్లోని బంకా ప్రాంతంలో కూడా పిడుగులు పడ్డాయి. దీంతో పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు. జార్ఖండ్లోని పలాము జిల్లాలో ఎనిమిది మంది చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు, ఓ రైతు ఉన్నారు. ఒడిశాలోని మయూర్భంజ్, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఐదుగురు దుర్మరణం చెందారు.