Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తూరు: రేణిగుంటలో ఆర్పీఎఫ్ బ్యారక్లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బర్రాక్లో ఆనందరావు విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాగా పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.