Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉజ్జయిని జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. జోగ్ఖేడి గ్రామంలో బాలిక ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడినట్లు భేరుగఢ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జీ ప్రవీణ్ పాఠక్ తెలిపారు. బాలిక 10-12 ఫీట్ల లోతులో పడిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేకంటే ముందే గ్రామస్థులు బాలికను వెలికితీసి సమీప ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు బాలిక అప్పటికే చనిపోయింది. విచారణ అనంతరం బోరుబావి యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు.