Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గజ్వేల్: పొలంలో పని చేస్తున్న రైతు విద్యుదాఘాతంతో చనిపోయిన ఘటన గజ్వేల్ మండలం దాతర్పల్లిలో శనివారం చోటు చేసుకుంది. గజ్వేల్ సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన క్రాంతికుమార్ (కాంతం) పొలంలో పారతో ఒడ్డు చెక్కుతుండగా గడ్డిలో కనిపించకుండా ఉన్న విద్యుత్తు తీగ తగలడంతో విద్యుదాఘాతం బారిన పడ్డారు. పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని గమనించిన చుట్టుపక్కల రైతులు చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.