Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అనంత్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన పాటలతో తెలుగువారి హృదయాలను దోచుకున్నారు. అయితే ఇటీవల రాసిన ఓపాట కారణంగా ఆయనపై ఓ కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అనంత్ శ్రీరామ్ వరుడు కావలెను అనే సినిమా కోసం ఓ పాటను రాశారు. అయితే ఆయన రాసిన పాట దేవుడిని కించపరిచేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగశౌర్య హీరోగా నటిస్తోన్న వరుడు కావలెను సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ రచన ఉందని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంత శ్రీరామ్ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపిస్తున్నారు. అనంత శ్రీరామ్తో పాటు ఆ సినిమా యూనిట్పై చర్యలు తీసుకోవాలని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.