Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తన బిడ్డను పెంచలేక ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. కన్నబిడ్డనే బస్సు కిందకు తోసేసి చంపేయాలనుకుంది. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మళువన్నూర్ తట్టముకల్లో ఓ తల్లి తన బిడ్డను పెంచలేకపోయింది. దాంతో చిన్నారిని చంపేయాలని నిర్ణయించుకుంది. ఓ ఆర్టీసీ బస్సు కిందకు చిన్నారిని తోసేసింది. అయితే ఆ చిన్నారికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు స్పందించి ఆ తల్లిని పోలీసులకు అప్పగించారు. ఆమెకు నలుగురు పిల్లలు అని, ఆమె ఒక అద్దె ఇంట్లో ఉంటుందని సమాచారం.