Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ వద్ద జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడిని గోదావరిఖనికి చెందిన లారీ డ్రైవర్ విజయ్ కుమార్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.