Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(ఐజీఐ ఎయిర్పోర్టు)ను బాంబులతో ధ్వంసం చేస్తామంటూ ఉగ్రవాద సంస్థ అల్కైదా హెచ్చరించింది. ఢిల్లీ పోలీస్ విభాగానికి అల్కైదా పేరుతో ఈ మెయిల్ వచ్చింది. రాబోయే కొద్దిరోజుల్లో ఐజీఐ ఎయిర్పోర్టును బాంబులతో పేల్చివేస్తామంటూ దానిలో హెచ్చరించారు. దీంతో ఢిల్లీ పోలీసు విభాగం మరింత అప్రమత్తమయ్యింది. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.