Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూర్యపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో భూ కంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7:40, 8:20 గంటలకు రెండు సార్లు భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు. దాంతో ఇండ్ల నుంచి ప్రజలు బయటకు పరిగెత్తారు. రెండు రోజుల క్రితం కూడా అక్కడ భూమి కంపించింది. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.