Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మల్: ఓ స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటన నిర్మల్లో చోటుచేసుకుంది. స్థిరాస్తి వ్యాపారి విజయ్చందర్ దేశ్పాండేను దుండుగులు కిడ్నాప్ చేశారు. తన్వి అపార్ట్మెంట్లోని ఇంట్లో ఉన్న విజయ్చందర్ దుండగులు వచ్చి కారులో తీసుకువెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద విజయ్చందర్ ఆచూకీ లభిచింది. కిడ్నాప్కు పాల్పడిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.