Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉద్యోగులకు అమెజాన్ భారీ ఆఫర్ను ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతుల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రెండు నెలల క్రితం ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారికి మాస్క్ అవసరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న పబ్లిక్ మాస్క్లు లేకుండా, కోవిడ్-19 నిబంధనల్ని ఉల్లంఘించారు. దీంతో మరోసారి కరోనా విజృభించింది
అయితే 'మాస్క్ ఫ్రీ' ప్రకటనతో కరోనా ఇప్పుడు అగ్రరాజ్యాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజుకు కనీసం లక్షకుపైగా కరోనా కేసులు నమోదు కావడంతో పాటు.. వందల సంఖ్యలో డెల్ట్ వేరియంట్ బాధితులు ఆస్పత్రిపాలవుతున్నారు. ఇప్పటికే మాస్క్ ఫ్రీ అని ప్రకటించిన అమెజాన్ దిద్దుబాటుకు చర్యలు తీసుకుంది. అమెజాన్ హెడ్ క్వార్టర్స్కు చెందిన లాజిస్టిక్స్ సెంటర్ లో పనిచేస్తున్న 9మంది ఉద్యోగులు వ్యాక్సినేషన్ వేయించుకోలేదు. పైగా మాస్క్ లేకుండా తిరగడం వల్ల.. సహోద్యోగులు కరోనా భారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అమెజాన్ వ్యాక్సిన్ ఆఫర్ను ప్రకటించినట్లు తెలుస్తోంది. 'మ్యాక్స్ యువర్ వ్యాక్స్' లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు బహుమతుల్ని ప్రకటించనుంది. ఇందుకోసం రూ.14.9కోట్లను కేటాయించిందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు లాటరీ టికెట్లు అందజేస్తూ.. డ్రాలో విజేతలుగా నిలిచిన మొదటి ఇద్దరికి రూ.3.7కోట్లను అమెజాన్ అందించనుందని తెలిపింది. తర్వాత ఆరుగురికి రూ. 74లక్షలు, మరో ఐదుగురికి కార్లు, వెకేషన్ ప్యాకేజీలను అందించనుందని బ్లూమ్బర్గ్ పేర్కొంది. 11,00అమెజాన్ సైట్లలో వ్యాక్సిన్ నేషన్ ప్రక్రియను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ స్పోక్పర్సన్ కెల్లీ నాన్ టెల్ తెలిపారు. బహుమతులతో పాటు వ్యాక్సినేషన్ ఈవెంట్లను నిర్వహించడం ద్వారా ఉద్యోగులు కరోనా బాధి నుంచి ఉపశమనం పొందవచ్చని వెల్లడించారు.