Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైలు ప్రయాణికుల ఫిర్యాదులు, ఇతర ఏ సమాచారానికైనా టోల్ ఫ్రీ నెంబర్ 139ను రైల్వే తీసుకొచ్చింది. గతంలో ఫిర్యాదులు తదితర వాటికి వేర్వేరు టోల్ఫ్రీ నంబర్లు ఉండగా వాటన్నింటినీ కలిపి రైల్ మదద్ పేరుతో 139 టోల్ఫ్రీ నంబర్ను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ నంబర్ 24 గంటలు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 12 భాషల్లో సేవలు అందించనుంది. అయితే 139 నంబర్కు వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 99.93 శాతం పరిష్కరించామని రైల్వేమంత్రి వైష్ణవ్ ఇటీవల రాజ్యసభలో తెలిపారు. అలాగే ఫీడ్ బ్యాక్ లో 72 శాతం పాజిటీవ్ యే ఉన్నాయన్నారు.