Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పరాయి పురుషులతోతో మాట్లాడనని తనకు హామీ పత్రం రాసివ్వాలని భార్యపై ఓ భర్త ఒత్తిడి చేశాడు. అందుకు భార్య నిరాకరించడంతో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో గుంతకల్లు పట్టణం ఆంథోని కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గుంతకల్లుకు చెందిన రజాక్కు అనంతపురానికి చెందిన షర్మిలతో 15 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భార్యపై భర్తకు అనుమానం పెంచుకున్నాడు. దాంతో నాలుగు నెలల క్రితం ఆమెను అతను కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
అనంతరం ఇటీవల మూడు రోజుల కింద భార్య తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఇక నుంచి ఇతర పురుషులతో మాట్లాడనంటూ తనకు రాతపూర్వకంగా రాసి ఇస్తేనే ఇంట్లో ఉండాలని షర్మిలపై రజాక్ ఒత్తిడి చేశాడు. అయితే.భర్త షరతులకు భార్య ఒప్పుకోలేదు. దాంతో రజాక్ తన ఇంట్లో ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.