Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఓ ఆలయంపై దాడి జరిగిని సంగతి తెలిసిందే. అయితే ఆలయాన్ని కాపాడటంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందంటూ పాక్ సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితులు సహా 50 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో 150 మందిపై కేసులు నమోదు చేశారు.
యార్ఖాన్ జిల్లా భొంగ్ నగరంలోని ఓ స్కూలు ఆవరణలో మూత్ర విసర్జన చేశాడంటూ అరెస్టు చేసిన ఓ బాలుడిని పోలీసులు విడుదల చేసినందుకు నిరసనగా కొందరు స్థానిక ఆలయాన్ని బుధవారం ధ్వంసం చేశారు. దాంతో ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కేసును విచారించిన పాక్ సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై మండిపడింది. దాంతో పోలీసులు రంగంలో దిగి నిందితులను అరెస్టు చేశారు. ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించే పనులు మొదలయ్యాయని పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ తెలిపారు. ఇకపై ఆలయాలపై దాడులు జరక్కుండా చూస్తామని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.