Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఢిల్లీలో నిరాశ్రయులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇల్లు లేని పేదల కోసం నడుపుతున్న నైట్ షెల్టర్లలో తలదాచుకునేవారి కోసం ఆహార సరఫరా పథకాన్ని అక్కడి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. , ఢిల్లీ ప్రభుత్వం 209 నైట్ షెల్టర్లను నిర్వహిస్తుండగా సుమారు 12 వేల మంది తలదాచుకుంటున్నారు. వీరికి ఆహారాన్ని అక్షయ పాత్ర సరఫరా చేస్తుందని ట్విట్టర్ లో ప్రకటించారు.