Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రియల్టర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. విజయభాస్కర్రెడ్డి హత్య కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్ఎంపీ డాక్టర్ ను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు త్రిలోక్నాథ్ బాబా కోసం గాలిస్తున్నారు. బాబా అక్రమాలను ప్రశ్నించినందుకే హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేపీహెచ్బీ అడ్డగుట్టలో విజయభాస్కర్రెడ్డి నివాసం ఉంటున్నారు. గత నెల 20న రియల్టర్ విజయభాస్కర్రెడ్డి అదృశ్యమైయ్యారు. కారు నెంబర్ సాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.