Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఆటోలో పలువురు ధర్మపురి మంచిర్యాల వైపు వెళ్తున్నారు. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ధర్మపురి వైపు వస్తోంది. ఈ క్రమంలో రాయపట్నం గ్రామ వడ్డెర కాలనీ వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మంచిర్యాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.