Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డ్రగ్స్ కొనేందుకు రెండున్నర ఏండ్ల కుమారుడ్ని తండ్రి అమ్మేశాడు. అస్సాం మోరిగావ్లోని లాహిఘాట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అమీనుల్ ఇస్లాం, డ్రగ్స్కు బానిస కావడంతోపాటు డ్రగ్ పెడ్లింగ్లో సంబంధం ఉండటంతో భార్య రుక్మినా బేగం గొడవపడి తండ్రి ఇంటికి వచ్చి ఉంటున్నది. అయితే ఇటీవల అమీనుల్ అక్కడకు వచ్చాడు. ఆధార్ కార్డుకు దరఖాస్తు చేయాలంటూ రెండున్నర ఏండ్ల కుమారుడ్ని తన వెంట తీసుకెళ్లాడు. అయితే మూడు రోజులైనా బాబును భర్త తీసుకు రాకపోవడంతో భార్య రుక్మినా బేగం అనుమానించింది. ఆరా తీయగా డ్రగ్స్ కొనుగోలుకు సాజిదా బేగం అనే మహిళకు కుమారుడ్ని రూ.40,000కు అమీనుల్ అమ్మినట్లు తెలుసుకున్నది. దీంతో ఈ నెల 5న పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు సాజిదా బేగం ఇంట్లో ఉన్న బాలుడ్ని రక్షించి తల్లికి అప్పగించారు. అమీనుల్తోపాటు సాజిదా బేగంను అరెస్ట్ చేశారు. మరోవైపు అమీనుల్కు డ్రగ్స్తోపాటు సెక్స్ రాకెట్ వంటి అసాంఘిక కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపించారు.