Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాను మరణించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సీనియర్ నటి, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత ఊర్వశీ శారద స్పందించారు. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యొద్దని.. ప్రస్తుతం తాను చెన్నైలో క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఎవరో పనికి మాలిన వాళ్లు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఉంటారన్నారు. ఎవడో వెధవ చేసిన అల్లరికి మనశ్శాంతి లేకుండా అయిందన్నారు. ఎవరో ఎదవ చేసిన పనికి అందరూ ఏడుస్తున్నారు.. చివరకు మగాళ్లను కూడా ఏడిపించేశారన్నారు. తనకు ఒకటే కాల్స్ వస్తున్నాయన్నారు. పనీపాటా లేని వారు ఏదైనా మంచి పని చేసుకోవాలని, ఇకనైనా ఇలాంటి పద్దతి మార్చుకోవాలని ఆమె అన్నారు.