Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన టోక్యో ఒలంపిక్స్ ఈ ఏడాది ఘనంగా జరిగి నేటితో ముగిసింది. ప్రేక్షకులను అనుమతించకుండా జరిగిన తొలి ఒలింపిక్ గేమ్స్ ఇవే కావడం విశేషం. రెండు వారాల పాటు ప్రపంచాన్ని తమవైపు తిప్పుకున్న ఒలంపిక్స్ ఇక ఘనంగా ముగిసింది. కాసేపట్లో ముగింపు వేడుకలు టోక్యోలోని నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి.
అమెరికా టాప్..
ఈసారి పతకాల జాబితాలో అమెరికా టాప్ లో నిలిచింది. చైనా చివరి రోజు వరకు తీవ్రమైన పోటీ ఇచ్చినా చివరి రోజు అమెరికాకే ఆ స్థానం సొంతమైంది. శనివారం వరకూ చూస్తే చైనా 38 గోల్డ్ మెడల్స్తో టాప్లో ఉండగా.. అమెరికా ఖాతాలో 36 మాత్రమే ఉన్నాయి. అయితే ఆదివారం బాస్కెట్బాల్, వాలీబాల్లతో పాటు సైక్లిస్ట్ జెన్నిఫర్ వాలెంటీలు బంగారు పతకాలు గెలవడంతో అమెరికా టాప్లోకి వెళ్లింది. అమెరికా ఖాతాలో 39 బంగారు పతకాలతోపాటు మొత్తం 113 పతకాలు ఉన్నాయి. ఒలింపిక్స్లో అత్యధిక మెడల్స్తో అమెరికా ముగించడం ఇది వరుసగా మూడోసారి. రికార్డు స్థాయిలో అమెరికా 600కుపైగా అథ్లెట్లతో బరిలోకి దిగింది.
ఇక చైనా 38 బంగారు పతకాలతోపాటు మొత్తం 88 పతకాలతో రెండోస్థానంలో నిలిచింది. బంగారు పతకాల పరంగా జపాన్ (27), బ్రిటన్ (22), రష్యన్ ఒలింపిక్ కమిటీ (20) టాప్ 5లో ఉన్నాయి.
భారత్ కు 48వ స్థానం
టోక్యో ఒలింపిక్స్లో ఈ సారి భారత్ పరిస్థితి చాలా మెరుగైంది. రియో గేమ్స్లో 67వ స్థానంతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి 48వ స్థానంలో నిలిచింది. భారత్ ఖాతాలో 1 బంగారు పతకం, 2 వెండి పతకాలు, 4 కాంస్య పతకాలు సహా మొత్తం 7 పతకాలు ఉన్నాయి.
టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించింది వీరే..
1. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) - బంగారు పతకం
2. మీరాబాయి చాను (రెజ్లింగ్ 49కేజీ) - రజతం
3. రవి కుమార్ దహియా (రెజ్లింగ్ 57కేజీ)- రజతం
4. పీవీ సింధు (బ్యాడ్మింటన్)- కాంస్యం
5. భారత హాకీ టీమ్ (ఫురుషులు)- కాంస్యం
6. బజరంగ్ పునియా (రెజ్లింగ్ 65కేజీ)- కాంస్యం
7. లవ్లీనా (బాక్సింగ్ 64కేజీ)- కాంస్యం