Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తాను కేసీఆర్, హరీశ్ రావుల గుండెల్లో ఉన్నానన్నారు. హుజురాబాద్లో తనపై పోటీ చేయడానికి కేసీఆర్, హరీశ్ వస్తారా? అని ప్రశ్నించారు. కనీసం తన డిపాజిట్ను టచ్ చేయగలరా అని సవాల్ విసిరారు. దమ్ముంటే నిజాయితీగా ఓట్లు వేయించుకోవాలని, ప్రలోభాలు, దావతులు ఆపాలని అన్నారు. పోలీసు, ఇంటలిజెన్స్ వారిని వెనక్కితీసుకోవాలని అన్నారు. తన మనుషులను బయపెట్టడం ఆపండన్నారు.