Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలోని మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతున్నది. హైదరాబాద్లో శనివారం రాత్రి రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో మణికొండలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్ (42)గా గుర్తించారు. ఆయన షాద్నగర్లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలానికి 50 మీటర్ల దూరంలోనే రజనీకాంత్ ఇల్లు ఉన్నది. నిన్న రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీ కాంత్.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. వర్షపు నీటితో నిండటంతో దారి కనబడకపోవడంతో గుంతలో పడిపోయాడు. దీంతో గల్లంతైన రజనీకాంత్ కోసం రెండు డీఆర్ఎఫ్ బృందాలు గలిస్తున్నాయి. నాలాలు కలిసే ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు వద్ద మరో బృందం గాలిస్తున్నది.