Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ అవసరం లేదని, రాష్ర్టంలో అంత కరోనా తీవ్రత లేదని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. కొవిడ్ పరిస్థితులపై మంగళవారం హైకోర్టు విచారణ నేపథ్యంలో నివేదికను ఆయన సమర్పించారు. తెలంగాణలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమన్నారు. అయితే ముందు జాగ్రత్తగా ఈనెల 31 వరకు కరోనా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఇంటింటి జ్వరం సర్వే కొనసాగుతోందని.. మూడు రోజుల్లోనే లక్షణాలున్న లక్షా 78 వేలమందికి కిట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని తెలిపారు. 18 ఏండ్లలోపు వారిలో 59 శాతం మందికి టీకాలు ఇచ్చామన్నారు. ఇక రాష్ట్రంలో 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు పూర్తైందని తెలిపారు.