Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐదు రాష్ర్టాల ఎన్నికల వేళ రాజకీయ పార్టీల 'ఉచితః` హామీలపై కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఉచితాల వాగ్దానం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉచిత పథకాలను అమలు చేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు రోజుల కింద అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాంటి పార్టీల ఎన్నికల గుర్తును నిలిపివేయడం లేదా పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిటిషనర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి చట్టాన్ని రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. 4 వారాల్లోగా దీనికి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.