Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వకుండా వారి ఇంట్లోనే 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు సీఎం సిగ్గు పడి తలదించుకోవాలన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
'తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు,
7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి ఐదు, పది చదవని వాళ్లను మంత్రులు చేసినందుకు,
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్ గారు సిగ్గుపడాలి. అవమానంతో తలదించుకోవాలి. చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు` అని ఆమె పేర్కొన్నారు.