Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హనుమకొండ జిల్లా అరెపల్లిలో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే... భూసేకరణ జీవో 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అరెపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. అయితే వారికి మద్దతు తెలిపేందుకు తీన్మార్ మల్లన్న అక్కడకు చేరుకున్నారు. దాంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం రైతులు మాట్లాడుతూ.. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎంత మందిని అరెస్ట్ చేసినా తమ ఆందోళనలు ఆగవని అన్నారు.