Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్లు రెండు నిండిపోయాయి. నారాయణగిరి, ఎంబిసి, ఎటిసి, టిబిసి, ఎస్ఎంసి, దాటి లేపాక్షి మీదుగా రాంభంగిచా వరకు భక్తులు వేచి ఉన్నారు. చిన్న పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు ఊపిరాడక....ఉక్కపోతకు గురవుతున్నారని పలువురు వాపోయారు. క్యూ లైన్లలో కనీసం నిలబడేందుకు స్థలం లేక భక్తులు గేట్లపైకి ఎక్కి నిల్చున్నారని తెలిసింది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో విఐపిలు కూడా తమ యాత్రను పునరాలోచించుకోని నిర్ణయం తీసుకోవాలని కోరింది.