Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబుజా : నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాటలో జరిగి 31 మంది మరణించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ నగరంలో శనివారం తెల్లవారుజామున చర్చి వద్ద ఆహారంతోపాటు, బహమతులు పంపిణీ చేశారు. దాంతో వందలాది మంది ప్రజలు వచ్చారు. చాలామంది తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. అయితే, ఎంతసేపటికీ వారి వంతు రాకపోవడంతో అసహనం చెందిన కొందరు ముందుకు దూసుకెళ్లారు. చాలా మంది గేట్లు పగులగొట్టుకుని లోపలికి చొచ్చుకొచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దాంతో 31 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు చర్చికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం పూర్తి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.