Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని సంగీత్ వద్ద సెయింట్ ఆన్స్ హై స్కూల్ సమీపంలో ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు, పాదాచారులకు ఈ పుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. భాగ్యనగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు.