Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహారాష్ర్టలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్ధవ్ థాకరే సవాల్ విసిరారు. దమ్ముంటే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని అన్నారు. అలాగే వారు వారి తండ్రుల పేరుతో ప్రచారం చేసుకుని గెలవాలని.. బాల్ థాకరే పేరు వాడొద్దని చెప్పారు. అలాగే రెబెల్ ఎమ్మెల్యేలు బాల్ థాకరే పేరును వాడరాదని ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. శివసేన రెబెల్స్ తమ గ్రూపునకు శివసేన బాలాసాహెబ్ అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.