Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో జరిగిన హింసాకాండలో ప్రధాని నరేంద్ర మోడీకి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒకరోజు తర్వాత మోడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన జకియా జాఫ్రీకి న్యాయసాయం అందించిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. ముంబైలోని ఆమె ఇంటి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, ఆపై అహ్మదాబాద్కు తీసుకెళ్లినట్లు ఆమె కుటుంబం తెలిపింది. అహ్మదాబాద్ సిటీ క్రైం బ్రాంచ్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. గుజరాత్ అల్లర్ల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందన్న ఆరోపణలపై తీస్తా మరియు ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులపై కేసు నమోదైందని సమాచారం. అప్పటి గుజరాత్ అల్లర్లలో జకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ చనిపోయారు.