Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హెల్మెట్ ధరించకుండా బైక్ పై ప్రయాణించిన మంత్రి, ఎమ్మెల్యేలకు ట్రాపిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది. తాజాగా బాలేశ్వర్ ఎమ్మెల్యే స్వరూప్ దాస్తో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ బాలేశ్వర్లోని వివిధ పాఠశాలల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా ఎమ్మెల్యే స్వరూప్ దాస్ బైక్ను నడిపారు. ఆయనతో పాటు బైక్పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ కూడా ఉన్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు రూ.1000 జరిమానా విధించారు. అనంతరం వారు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫైన్ కట్టి వచ్చారు.
ఎమ్మెల్యే స్వరూప్ దాస్ మాట్లాడుతూ.. 'చట్టానికి ఎవరూ అతీతులు కారు. మంత్రి సమీర్ రంజన్ దాస్, నేను బాలేశ్వర్లోని వివిధ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించడానికి బైక్పై ప్రయాణించాము. మేం హెల్మెట్ పెట్టుకోలేదు. మేము హేమ్కపద చౌరస్తా దాటినప్పుడు, ఒక పౌరుడు దానిని మా దృష్టికి తీసుకువచ్చాడు. మేము దానిని గ్రహించాము. మా తప్పును అంగీకరించాము. నిబంధన ప్రకారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రూ.1000 జరిమానా జమ చేశాం. భవిష్యత్తులో ఇది పునరావృతం కాదు` అని అన్నారు.