Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బిహార్లో జేడీయూ మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగగా.. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత తేజస్వియాదవ్తో కలిసి నితీశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10న ఎనిమిదోసారి నితీశ్కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేబినెట్ను విస్తరించనున్నారు. బిహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీకి 16 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నది. జేడీ(యూ)కు 11, జీతన్రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి ఒకటి, మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్కు రెండు, మరో స్వతంత్ర ఎమ్మెల్యేకు సైతం మంత్రి దక్కనున్నది. మొత్తం 31 మందిని కేబినెట్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.