Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రం ముల్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్, బస్సు డీకొన్న ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. ప్రయాణికులతో లాహోర్ నుంచి కరాచీకి హైవేపై వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అతికష్టం మీద అదుపు చేశారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనేక మృదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, డీఎన్ఏ పరీక్షల ఆధారంగానే వారిని నిర్ధారించాల్సి ఉంటుందని అధికారి వెల్లడించారు.