Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
రాష్ట్రాలకు గవర్నర్ల నియామక విధానంపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్తగా ఆరుగురిని గవర్నర్లుగా నియమిస్తూ, ఏడుగురు గవర్నర్లను బదిలీ చేయడంతో కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోసం పని చేసేవారికి గవర్నర్ పదవిని ఇస్తున్నారని దుయ్యబట్టింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా నియమించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్లో, మోడీదీ కోసం పని చేసినవారు ఇప్పుడు గవర్నర్లు అయ్యారని వ్యాఖ్యానించారు. అదానీ కోసం మోదీ పని చేస్తారని, మోడీ కోసం పని చేసేవారు గవర్నర్లు అవుతారని అన్నారు. ఇక ప్రజల కోసం ఎవరు పని చేస్తారని ప్రశ్నించారు.