Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు చీఫ్ జస్టిస్లను నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కొత్తగా నియమితులైన చీఫ్ జస్టిస్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ సోనియా గిరిధర్ గోకని, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ సందీప్ మెహ్తా, త్రిపుర సీజేగా జస్టిస్ జస్వంత్ సింగ్, జమ్ము కశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్ కోటిశ్వర్ సింగ్ నియమితులయ్యారు.