Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాలు మొత్తం 56.25 గంటల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగాయి. ఈ నెల 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గర్నవర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభ చర్చించింది.
ఈ తరుణంలో పలు బిల్లు, తీర్మానాలపై చర్చ సాగింది. సమావేశాలు చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్రావు ద్రవ్య వినియమ బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై సమాధానాలు ఇచ్చారు. చివరగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.