Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అసోం
నాగావ్: అసోంలోని నాగావ్లో ఆదివారం సాయంత్రం 4.18 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. ఈ మేరకు జాతీయ భూకంప నమోదు కేంద్రం ట్విట్టర్ ద్వారా తెలిపింది. భూ ప్రకంపనల వార్తలతో జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. గుజరాత్లోని సూరత్లో శనివారం 3.8 తీవ్రతతో ప్రకంపనలు కనిపించాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత 12.52 గంటల సమయంలో ప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. భూమికి 5.2 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.