Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది. యుక్సోమ్కు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం అసోంలోని నాగౌన్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయింది. అదేవిధంగా గుజరాత్లోని సూరత్ జిల్లాలో 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.