Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్నూలు
కౌతాళం మండలంలోని కామవరం గ్రామంలో ఆదివారం విద్యు దాఘాతంతో చేతి కొచ్చిన చెరుకు పంట అగ్నికి దగ్ధంమైంది. రైతు తలారి నరసిం హులు తనకున్న ఒకటిన్నర పొలానికి తోడు మరో ఒకటిన్నర ఎకర కౌలుకు తీసుకుని చెరుకు పంటను సాగు చేస్తున్నాడు. పొలం లోని విద్యుత్ తీగలు చెరకు పంటకు తాకి మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోయినట్లు తెలిపారు. ఎకరాకు సుమారు 50 టన్నుల ప్రకారం మూడు ఎకరాల్లో 150 టన్నుల చెరుకు పంట వచ్చేదని, ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం తనకు రూ.3లక్షలు వచ్చేవని ఆవేదన వ్యక్తం చేశారు.