Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
జిల్లాలోని తాడేపల్లిలో దారుణం జరిగింది. ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన యువతిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే తరుణంలో ప్రాణాలు కోల్పోయింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థాలానికిస్థాలానికి చేరుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తిని రాజుగా గుర్తించి, అతడి కోసం గాలింపు చేపట్టారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. నిన్న రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు అతడిని నిలదీశారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.