Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ కొండగట్టు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉదయం 9 గంటలకు కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బేగంపేటకు బయల్దేరుతారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టుకు చేరుకుంటారు. ఉదయం 9:40 గంటలకు సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుంటారు.
అందే కాకుండా కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయంతో పాటు తదితర ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నారు. సమీక్ష ముగిసిన వెంటనే కేసీఆర్కు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా పరిశీలించారు.