Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న జగిత్యాల జిల్లా కొండగట్టుకు రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను కలెక్టర్ యాస్మిన్ భాష మంత్రి కొప్పులకు వివరించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసే వరకు ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మంత్రి వెంట చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఎస్పీ భాస్కర్, కొండగట్టు ఆలయ ఈవో వెంకటేశ్ తదితరులు ఉన్నారు.