Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనకాపల్లి
ఎస్.రాయవరం మండలంలో అడ్డురోడ్డు పెద్ద గుమ్ములూరు మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తి కొరుప్రోలు గ్రామానికి చెందిన డి.ప్రవీణ్ గా గుర్తించారు. కోరుప్రోలు పీచు పరిశ్రమలో పనిచేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. దాడికి గురైన వ్యక్తిని స్థానికులు108 అంబులెన్స్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన దుండగులు వెంటనే అక్కడ నుంచి పరారయ్యారు. నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రావు, ఎస్.ఐ ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కి తరలించారు. ఎస్.రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.