Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తాడేపల్లి
పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీసు స్టేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ తరుణంలో సీఎం మాట్లాడుతూ పోలీస్శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని అన్నారు. పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు, 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ తరుణంలోనే విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్ సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు. పోలీస్ బూత్తోపాటు 10 ద్విచక్ర వాహనాలు, రెండు పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు.