Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్లో మూడు లక్షల ఓట్లు ఉంటే, మూడు వేల ఓట్లు పడ్డాయన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్టు అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవదని అందరికీ తెలుసన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో ఎక్కడ లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తూర్చుకపోయిందని.. అందుకే జాతీయ పార్టీ పెట్టారన్నారు. ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలకు, ఆయా కులాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. తాను బీసీని అని... దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. 90 శాతం ప్రజలు తనకు సపోర్ట్గా ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ పుట్టినరోజునే సెక్రటేరియట్ ప్రారంభించాలని పాల్ డిమాండ్ చేశారు.